విమానంలో మంట‌లు.. ప్ర‌యాణికులు ప‌రుగులు..

బీజింగ్ (CLiC2NEWS): చైనాలోని చాంగ్‌కింగ్ విమానాశ్ర‌యంలో భారీ ప్ర‌మాదం త‌ప్పింది. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మంట‌లు చెల‌రేగాయి. అయితే విమానంలో ఉన్న‌వారు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై ప్ర‌యాణికులను వెంట‌నే దించేయ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది గాయ‌ప‌డ్డారు.

టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్సి ప్రాంతానికి బ‌య‌లుదేరుతుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. మంట‌లు చూస్తుండ‌గానే పెద్దె ఎత్తున ఎగ‌సిప‌డ్డాయి. ఘ‌ట‌న స‌మ‌యంలో విమానంలో 113 మంది ప్రాయ‌ణికులు 9 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబందించిన‌.. మంట‌ల‌కు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న పై అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.