ఎపి ఐసెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

విశాఖ (CLiC2NEWS): ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ఎపి ఐసెట్ 2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు సెట్ క‌న్వీన‌ర్ ఆచార్య ఎన్ కిషోర్‌బాబు తెలిపారు. జూన్ 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రిస్తామ‌న్నారు. అప‌రాధ రుసుముతో జులై 9వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. జులై 25వ తేదీన ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల కోసం cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.