టైరు పేలి లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు సజీవదహనం
కారులో మంటలు వ్యాపించి ముగ్గురు సజీవదహనం
మార్కాపురం (CLiC2NEWS): ప్రకాశం జిల్లాలో కారు ప్రమాదానికి గురైంది. జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద కారు టైరు పేలడంతో లారీని ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. మరణించిన వారిలో కారు డ్రైవర్ చిత్తూరు జిల్లా భాకరా పేటకు చెందిన రావూరి తేజగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.