ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామా..!
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అనిల్ బైజల్ 2016 డిసెంబర్ 31వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఐదున్నరేళ్లుగా పదవిలో కొనసాగారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అనిల్ బైజిల్కు మధ్య పలుమార్లు వివాదాలు తలెత్తిన విషయం తెలిసినదే.