సిఎం కెసిఆర్ను కలిసిన తమిళ హీరో విజయ్..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ను తమిళ హీరో విజయ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. విజయ్తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిద్దరిని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సిఎం దగ్గరకు తీసుకెళ్లారు. కెసిఆర్, విజయ్ పలు అంశాలు చర్చించినట్లు సమాచారం.
విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. ‘దళపతి 66’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.