సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి: డిజిపి మహేందర్ రెడ్డి.

'సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ బుక్' ని ఆవిష్క‌ర‌ణ‌

రామ‌గుండం (CLiC2NEWS): సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, IT ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాన్సెప్ట్‌ ప్రెజెంటేషన్ పై జిల్లా ఎస్ పిలు, పోలీస్ కమీషనర్లతో డిజిపి ఎం. మహేందర్ రెడ్డి నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయ‌ని ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నదని తెలిపారు. ఇందుకోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒకరిని సైబర్ వారియర్ గా నియమించడం జరిగిందని తెలియ‌జేశారు.

సైబర్ నేరాలను నియంత్రించడంతో పాటు ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన “సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ బుక్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీస్ శాఖ ఐ.టి విభాగం రూపొందించిన ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి వివ‌రించారు. ఈ పుస్తకంలో తాజాగా జరుగుతున్న సైబర్ క్రైమ్ ల ఇన్వెస్టిగేషన్ & డిటెక్షన్ మెళుకువలు , చర్యలు మొదలైనవి ఉన్నాయని, ఈ పుస్తకం తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ వర్టికల్, సైబర్ వారియర్స్ సిబ్బందికి అవసరమైన అవగాహనను అందిస్తుందని ఆయ‌న‌ వివరించారు. అనతరం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారుల నుండి సైబర్ నేరాల నియంత్రణ ఫై తీసుకోవలసిన చర్యల పై పలు సూచనలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.