మరోసారి గ్యాస్ సిలెండర్ ధర పెంపు..
హైదరాబాద్ (CLiC2NEWS): అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా గత కొంతకాలంగా గ్యాస్ సిలెండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజగా వంటగ్యాస్ సిలెండర్ ధర మరోసారి పెరిగింది. గృహావసరాలకు వినియోగించే సిలెండర్ ధరను రూ. 3.50పెంచారు. అలాగే వాణిజ్య అవసరాలకు ఉపయోగించిఏ సిలిండర్ ధరను రూ. 8 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్ ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామాన్యులపూ తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.