బాక్సింగ్‌లో చ‌రిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ

 థాయ్‌లాండ్‌పై భార‌త్ విజ‌యం

ఇస్తాంబుల్‌ (CLiC2NEWS): తెలంగాణ ముద్దుబిడ్డ నిఖిత్ జ‌రీన్ ప్ర‌పంచ మ‌హిళ‌ల బాక్సింగ్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో విజ‌యం సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన జుట‌మ‌స్ జిట్పంగ్‌ను 5-0 తేడాతో ఓడించి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించింది. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు న‌మోదు చేసింది. ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన ఐదో బాక్స‌ర్‌గా జ‌రీన్ రికార్డు న‌మోదుచేసింది.

ఇస్తాంబుల్ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌పంచ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్లో 52 కేజీల విభాగంలో నిఖ‌త్ జ‌రీన్ అద్భుత విజ‌యం సాధించింది. అంత‌కు ముందు మేరీ కోమ్‌, స‌రితా దేవి, జెన్నీ ఆర్ ఎల్‌, లేఖ కేసి గోల్డ్ మెడ‌ల్‌ను సాధించారు.

Leave A Reply

Your email address will not be published.