డీజిల్ ట్యాంక‌ర్-క‌ల‌ప ట్ర‌క్కు ఢీ: 9మంది స‌జీవద‌హ‌నం

చంద్రాపూర్ (CLiC2NEWS): మ‌హారాష్ట్రలోని చంద్రాపూర్ వ‌ద్ద‌ ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది స‌జీవద‌హ‌న‌మ‌య్యారు. గురువారం రాత్రి 10.30 గంట‌ల ప్రాంతంలో డీజిల్ ట్యాంక‌ర్‌, క‌ల‌పతో ఉన్న ట్ర‌క్కు ఢీకొని మంట‌లు చెల‌రేగాయి. దీంతో తొమ్మిది మంది సజీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకునే స‌రికే బాధితులు మంట‌ల్లో చిక్కుకుపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ట్ర‌క్కులో ప్ర‌యాణించే ఆరుగురు ప్ర‌యాణికులతో పాటు ట్ర‌క్కు డ్రైవ‌ర్‌, డీజిల్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.