అన్న‌మయ్య జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

క‌ల్వర్టును ఢీకొని చెరువులో ప‌డిన కారు..

మ‌ద‌న‌ప‌ల్లె (CLiC2NEWS): అన్న‌మ‌య్య జిల్లాలో కారు ప్ర‌మాదానికి గురైంది. మ‌ద‌న‌ప‌ల్లో గ్రామీణం ప‌రిధిలోని పుంగనూరు రోడ్డు మ‌ద‌వ‌ప‌ల్లె వ‌ద్ద కారు క‌ల్వ‌ర్టును ఢీకొట్టి చెరువులో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రణించిన వారు నిమ్మ‌న‌ప‌ల్లెకు చెందిన గంగిరెడ్డి, మ‌ధుల‌త దంప‌తులు.. వారి పిల్ల‌లు కుషిరెడ్డి, దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. ఈ కుటుంబం పెళ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.