క‌ర్ణాట‌క‌లో ముగ్గురు హైద‌రాబాద్ వాసులు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): విహార‌యాత్ర‌కోసం క‌ర్ణాట‌క వెళ్లిన హైద‌రాబాద్ వాసులు ప్ర‌మాద‌వ శాత్తు నీట‌మునిగి మ‌ర‌ణించారు. తెలంగాణ‌కు చెందిన 16 మంది బంధు మిత్రులు విహార యాత్ర నిమిత్తం క‌ర్ణాట‌క వెళ్లారు. కుశాల‌న‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు హోమ్‌స్టేలో బ‌స చేసిన వారు ఆదివారం కోటె అబ్బి జ‌ల‌పాతం చేసేందుకు వెళ్లి ప్ర‌మాద‌వ‌శాత్తూ గ‌ల్లంత‌య్యారు. ప్ర‌మాద స‌మ‌యంలో చుట్లుప్ర‌క్క‌ల ఎవ‌రూ లేక‌పోవ‌డ‌తో వారిని ర‌క్షించం క‌ష్టంగా మారింది. గంట‌ల త‌ర‌బ‌డి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి ముగ్గురు మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. అప్పటి వ‌ర‌కు త‌మ‌తో ఉన్న వారు విగ‌త జీవులుగా మార‌డంతో బంధుమిత్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Leave A Reply

Your email address will not be published.