భ‌ర్త‌ను రోక‌లిబండ‌తో కొట్టి చంపిన భార్య‌

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): క‌రీంన‌గ‌ర్ జిల్లా గ‌న్నేరువ‌రం మండ‌లంలోని గుండ్ల‌ప‌ల్లిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్ల‌ప‌ల్లికి చెందిన పెనుగొండ వెంక‌ట్‌రెడ్డి, ల‌క్ష్మి భార్యాభ‌ర్త‌లు. భార్య ల‌క్ష్మికి మ‌రొక‌రితో అక్ర‌మ‌సంబంధం కొనసాగిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవి. ఈ క్ర‌మంలో త‌మ సంతోషానికి అడ్డుగా ఉన్న వెంక‌ట్‌రెడ్డి హ‌త్య చేయాల‌ని భార్య ల‌క్ష్మి నిర్ణ‌యించుకుంది. ఇదే అద‌నుగా బ‌ర్త‌ని రోక‌లిబండ‌తో కొట్టి చంపింది. అనంత‌రం భ‌ర్త మృత‌దేహాన్ని ప్ర‌యుడు వెంకట స్వామి సాయంతో హుస్నాబాద్ పొట్ల‌ప‌ల్లి వాగులో పూడ్చిపెట్టింది. కొంత కాలంగా వెంక‌ట‌రెడ్డి క‌నిపించ‌కుండా పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల ద‌ర్యాప్తు లో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ మేర‌కు నిందితులు పెనుగొండ ల‌క్ష్మి, ఆమె ప్రియుడు వెంక‌ట‌స్వామిని అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.