1, 2 తేదీల్లో కాంగ్రెస్ `చింతన్ శిబిర్`
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ కాంగ్రెస్ జూన్ 1,2 వ తేదీల్లో స్టేట్ లెవర్ చింతన్ శిబిర్ ను నిర్వహించనున్నట్లు సిఎల్సి నేత భట్టీ విక్రమార్క తెలిపారు. గాంధీభవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు…
మేడ్చల్ జిల్లా కీసరలో జూన్1,2 తేదీల్లో చింతన్ శిబిర్ను నిర్వహించనున్నామని తెలిపారు. చింతన్ శిబిర్లో వివిధ అంశాలను చర్చించేందుకు ఆరు గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ చర్చించిన అంశాలను రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చిస్తామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం బలోపేతం సామాజిక న్యాయాలపై చర్చ ఉంటుందని భట్టీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏ లక్ష్యంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారో దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని భట్టీ తెలిపారు.