ఒకే దేశం, ఒకే పోలీసు.. సమిష్టి సహకారంతో కలిసి పనిచేద్దాం!
జహీరాబాద్ (CLiC2NEWS): ఒకే దేశం ఒకే పోలీసు విభాగంగా సమిష్టి సహకారంతో కలిసి పనిచేద్దామని కార్ణటక, మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలోని హుమ్నాబాద్లో అంతరాష్ట్ర సరిహద్దు భద్రత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు భద్రత, నేర నియంత్రణ, నేరస్థుల అప్పగింతపై మాట్లాడారు. అంతరాష్ట్ర నేరస్థుల కదలికలు తగ్గుముఖంగా ఉన్నప్పటికీ సమాచార బదిలీతో అడ్డుకట్ట వేయాలన్నారు. పరస్పర సహకారంతో గాంజాయి, మాదకద్రవా్యాలు, మద్యం, దోపిడి దొంగలు, అక్రమ రవాణాను కట్టడి చేద్దామన్నారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.