విదేశీ బాలుడి నోట.. అచ్చ తెలుగు పాట..
విజయవాడ (CLiC2NEWS): విజయవాడలో ఐదవ ప్రపంచ తెలుగు రచయిత మహాసభలు నిర్వహిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలుగు మహాసభలను ప్రారంభించారు. దేశంలోని వారితోపాటు ఇతర దేశాల్లోని తెలుగు రచయితలు ఇక్కడికి తరలివచ్చారు. ఈ వేదికపై ఓ విదేశీ బాలుడు ఘంటసాల పాటలను పాడి అందరినీ ఆనందపరిచాడు. లవకుశలు చిత్రంలోని ‘వినుడు వినుడు రామాయణగాథ..’ అంటూ అచ్చ తెలుగులో ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.