మంచిర్యాల: పూర్వ విద్యార్థుల అపూర్వ స‌మ్మేళనం

జైపూర్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా జైపూర్ మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ సెంక‌డ‌రీ పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆదివారం పాఠ‌శాల ప్రాంగ‌ణంలో స‌మ్మేళ‌నం అయ్యారు. 23 సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలో చదివిన రోజులను వారంతా గుర్తు చేసుకొన్నారు. ఒకరికొకరు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మకు చదువు చెప్పిన గురువులు శ‌కంర్ రావు, ప్ర‌కాశ్ రావు, సురేష్‌, దివాక‌ర్ రెడ్డి, మారుతిరావు, ద‌త్త కుమార్‌, శ్రీ‌దేవి, జ్ఞాన‌లీలా, ప్ర‌మీళారాణి ల‌ను శాలువాల‌తో ఘ‌నంగా సత్కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అథితిగా 1999-2000 వ సంవ‌త్స‌రంలో ప్ర‌ధానోపాధ్యాయులుగా చేసిన కీ.శే.న‌ర్సింహారెడ్డి స‌తీమ‌ణి మ‌ధుర‌వాణి ముఖ్య అతితిగా పాల్గొన్నారు.
అనంత‌రం సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదివారం ZPHS జైపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఉపాధ్యాయులు శ‌కంర్ రావు, ప్ర‌కాశ్ రావు, సురేష్‌, దివాక‌ర్ రెడ్డి, మారుతిరావు, ద‌త్త కుమార్‌, శ్రీ‌దేవి, జ్ఞాన‌లీలా, ప్ర‌మీళారాణి ల‌ను సత్కరిస్తున్న పూర్వ విద్యార్థులు

ఈ స‌మ్మేళ‌నంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ స‌మ్మేళ‌నం గుర్తుండిపోయే విధంగా ప్రతి ఒక్కరికి మెమొంటో అందించారు. తాము చదివిన పాఠశాలకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు

 

ఆదివారం ZPHS జైపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పూర్వ విద్యార్థులు
ఆదివారం ZPHS జైపూర్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పూర్వ విద్యార్థులు
Leave A Reply

Your email address will not be published.