302 పరుగుల తేడాతో భారత్ విజయం..
వాంఖడె (CLiC2NEWS): వన్డే వరల్డ్కప్లో ఇప్పటికే ఆరు విజయాలు సాధించిన భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం శ్రీలంకతో జరిగన మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుని సెమీస్కు దూసుకెళ్లింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యాటర్లు కేవలం 55 పరుగులకే కుప్పకూలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లుకు ఆదిలోనే షాక్ ఎదురైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిశాంక, కరుణరత్నె వెనుదిరిగారు. నిశాంక ఎల్బిడబ్ల్యూగా వెనిదిరగగా.. సిరాజ్ వేసిన బంతికి కరుణరత్నె వికెట్ల ముందు దొరికిపోయాడు. 1.5 ఓవర్కు సమర విక్రమ ఔటయ్యాడు. దీంతో 2 ఓవర్లకు శ్రీలంక స్కోరు 2/3 చేసింది.
6 ఓవర్లకు శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ వేసిన బాల్కు కుశాల్ మెండిస్ క్లీన్బౌల్డ్ అయ్యాడు. షమి వేసిన 10వ ఓవర్లో మూడో బంతికి అసలంక జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. శ్రీలంక సగం వికెట్లు కోల్పోయింది. 14 కు ఓవర్లకే హేమంత ఔటవ్వడం.. 6వ వికెట్ కూడా కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది.