సంక్రాంతికి రానున్న ‘నాసామిరంగ’.. టీజర్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): నాగార్జున కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం నాసామిరంగ. ఈ చిత్రంతో విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం టీజర్ను విడుదల చేసింది. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.