ఈ నెల 18 నుండి 27 వరకు శ్రీవారి మార్చినెల కోటా టికెట్లు విడుదల..
తిరుమల (CLiC2NEWS): తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. 2024 మార్చి నెల కోటాకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు: డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు.. లక్కీడిప్ టికెట్ల కోసం నమోదు చేసుకోవచ్చు.
శ్రీవారి తెప్పోత్సవ టికెట్లు : డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు
శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10గంటలకు
శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటా: డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు
అంగప్రదిక్షణ టోకెన్లు డిసెంబర్ 23 ఉదయం 10గంటలకు
శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం, గదుల కోటా డిసెంబర్ 23 ఉదయం 11 గంటలకు
వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా డిసెంబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు
రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు
తిరుమల, తిరుపతిలోని గదుల కోటా డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు
తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటా, డిసెంబర్ 27 ఉదయం 11 గంటలకు
నవనీత సేవ కోటా డిసెంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు
పరకామణి సేవా కోటా డిసెంబర్ 27 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి.