అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
చెన్నంపల్లి (CLiC2NEWS): అనంతపురం జిల్లాలోని చెన్నంపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని మరోలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.