అధికారంలోకి రాగానే మెగా డిఎస్‌సి: చంద్ర‌బాబు

శ్రీ‌కాళ‌హ‌స్తి (CLiC2NEWS): 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా 8 డిఎస్‌సిలు పెట్టామ‌ని .. ఐదేళ్ల పాల‌న‌లో ఒక్క‌సారి కూడా డిఎస్‌సి వేయ‌లేని పాల‌న ప్ర‌స్తుత ప్ర‌భుత్వానిద‌ని అని టిడిపి అధినేత విమ‌ర్శించారు. శ్రీ‌కాళ‌హ‌స్తి ప్ర‌జాగ‌ళం స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. అధికారంలోకి రాగేనే మెగా డిఎస్‌సి వేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప‌ద‌వి ఉంటే ఒదిగి ప‌నిచేసిన వ్య‌క్తి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. టిడిపి హ‌యాంలో కోత‌లు లేని క‌రెంట్ ఇచ్చామ‌ని, ఐదేళ్లుగా గాడిత‌ప్పిన పాల‌న‌ను మేం వ‌చ్చాక స‌రిచేస్తామ‌న్నారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.