అన్నక్యాంటీన్ నిర్వహణకు సెల్కాన్ సిఎండి గురుస్వామి విరాళం
అమరావతి (CLiC2NEWS): ఎపిలోని అన్నక్యాంటీన్ నిర్వహణకు సెల్కాన్ సిఎండి వై.గురుస్వామి నాయుడు విరాళం అందజేశారు. తన జన్మదినం సందర్బంగా ఒక్క రోజు భోజన ఖర్చు కింద రూ. 26.25లక్షల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఆయన చెక్ను సిఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన్ని చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్లో పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే.