ప‌వ‌న్ ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటా: బాలినేని

అమ‌రావ‌తి (CLiC2NEWS): మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీసులో జ‌న‌సేన అధినేత , డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో భేట అనంత‌రం మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అడిగిన వెంట‌నే పార్టీలోకి ఆహ్వానించిన జ‌నసేన అధినేత ప‌వ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు బాలినేని తెలిపారు. ఇక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల మేర‌కు ప‌నిచేస్తాన‌ని తెలిపారు. అంద‌రినీ క‌లుపుకొని జ‌న‌సే అభివృద్ధికి కృషి చేస్తాన‌ని తెలిపారు. నాకు ప‌ద‌వులు ముఖ్యం కాదు.. గౌర‌వం కావాలి అని పేర్కొన్నారు. స్వ‌చ్ఛందంగా జ‌న‌సేన‌లో చేరుతున్నా.. ప‌ద‌వులు ఆశించ‌లేదు అని బాలినేని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.