కామారెడ్డి: నిజాంసాగ‌ర్ బ్యాక్ వాట‌ర్లో ముగ్గురు వ్య‌క్తులు గ‌ల్లంతు

కామారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని నిజాంసాగ‌ర్ బ్యాక్ వాట‌ర్‌లో మునిగి ముగ్గురు యువ‌కులు  గ‌ల్లంత‌య్చారు. సోమ‌వారం 9 మంది యువ‌కులు నిజాం సాగ‌ర్ ప్రాజెక్టు స‌మీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. అట ముగిసిన అనంత‌రం బ్యాక్ వాట‌ర్లో స్నానం చేసేందుకు దిగారు. వారిలో 6గురు మాత్రం ఒడ్డుకు చేరుకోగా మిగ‌తా ముగ్గురు ఆచూకీలేదు. సామాచారం అందుకున్న  అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టినా .. ముగ్గురి ఆచూకీ ల‌భించలేదు. నిజాంసాగ‌ర్ మండ‌లంలోని పిప్పిరియ‌ల్ తాండ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గ‌ల్లంతైన వారు మ‌ధుక‌ర్ గౌడ్‌, న‌వీన్‌, హ‌ర్ష‌గా గుర్తించారు. వీరు ఎల్లారెడ్డి, లింగారెడ్డి పేట‌, సోమ‌ర్ పేట గ్రామాల‌కు చెందిన‌వారుగా స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.