ఇంజినీరింగ్ ఫీజుల పెంపు లేనట్టే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. బిటెక్, బిఇ, ఎంఇ, ఎంటెక్ సహా బి-ఒకేషనల్ కోర్సులు చదవాలను కునే వారికి పాత ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పాత ఫీజులు కనసాగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజులపై త్వరలో కమిటీ వేస్తామని.. ఆ కమిటి ఇతర రాష్ట్రాల్లోని ఫీజులను పరిశీలిస్తుంది. అంతే కాకుండా కోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్ఉల సమాచారం.