ఢిల్లీ సిఎంపై దాడి!
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జరిగింది. బుధవారం తన అధికారిక నివాసంలో `జన్ సున్వాయ్` నిర్వహిస్తున్న సమయంలో దాడికి పాల్పడ్డట్లు భారతీయ జనతా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన జన్ సున్వాయ్ కార్యక్రమంలో 41 యేళ్ల వయసుగల వ్యక్తి ఫిర్యాదు దారుగా నటిస్తున్న కొన్ని పేపర్లను తీసుకొని సిఎం వద్దకు వచ్చాడు. తొలుత ఆ పేపర్లను ముఖ్యమంత్రికి అందజేసి అనంతరం సిఎంపై దాడికి పాల్పడినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.
నిందితుడు గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ భాయ్ కింజీ భాయ్ (41)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
आज सुबह जनसुनवाई के दौरान मुख्यमंत्री हमेशा की तरह जनता से बात कर रही थीं। एक व्यक्ति उनके पास आया, कुछ कागज़ दिए और अचानक उनका हाथ पकड़कर उन्हें खींचने की कोशिश की। इस दौरान थोड़ी धक्का-मुक्की हुई,लोगों ने उसे पकड़ लिया। वो कौन है और अन्य सभी विवरणों की पुलिस जांच कर रही है।… pic.twitter.com/eHmS3BL5uc
— BJP Delhi (@BJP4Delhi) August 20, 2025
కాగా ఈ ఘటనపై ఢిల్లీ బిజెపి ఓ ప్రకటన విడుదల చేసింది.. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా మీడియా మీడియాతో మాట్లాడారు… ఈ ఘటనతో సిఎం తీవ్ర దిగ్భంతికి లోనయ్యారని తెలిపారు. ఘటన అనంతరం సిఎం రేఖా గుప్తాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అతిషి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని అతిషి తెలిపారు.
ఈ ఘటనపై డిల్లీ మంత్రి ముంజీందర్ సింగ్ సిస్రా మీడియాతో మాట్లాడారు. ఈ దాడి ప్రత్యర్థుల కుట్ర కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. హస్తిన ప్రజలకోసం తీవ్రంగా శ్రమిస్తున్న సిఎం పై ఇలా దాడి చేయడం దురదృష్టకరమన్నారు.
Also read : హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిషన్
[…] ఢిల్లీ సిఎంపై దాడి! […]
[…] ఢిల్లీ సిఎంపై దాడి! […]