తెలంగాణ నూతన డిజిపిగా శివధర్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 2023 నుండి శివధర్ రెడ్డి ఇంటిలిజెన్స్ ఛీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటిలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. ఎస్పి, డిఐజి ఎస్ ఐబిగా మావోయిస్టుల అణిజివేతలో కీలక పాత్ర వహించారు. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా పలు అవార్డులు అందుకున్నారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావోలో శివధర్ రెడ్డి పనిచేశారు. గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పిగా ఆయన సేవలందించారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరులో విధులు నిర్వహిస్తున్నపుడు అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించారు. 2007వ సంవత్సరంలో మక్కా మసీదులో బాంబు పేలుడు , పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయారు. ఈ ఘటన అనంతరం హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగా ఆయన నియమితులయ్యారు.
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నిఘా విభాగాధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఆ సమయంలో నల్గొండ జిల్లా జానకీపురంలో సిమి ఉగ్రవాదుల కలకలం, వరంగల్ జిల్లా ఆలేరు వద్ద వికారుద్దీన్ తదితరుల ఎన్కౌంటర్, షాద్నగర్ వద్ద జరిగిన కాల్పుల్లో నేరగాడు నయీం హత్య వంటి ఘటనలు జరగాయి. 2016లో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి.. అదనపు డిజిగా నియమించింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా మళ్లీ శివధర్ రెడ్డిని నియమించింది.
[…] Also Read: తెలంగాణ నూతన డిజిపిగా శివధర్ రెడ్… […]
[…] Also Read :తెలంగాణ నూతన డిజిపిగా శివధర్ రెడ్… […]