Jangaon: అమ్మ ఫౌండేషన్ కు తొమ్మిది వసంతాలు

జనగామ (CLiC2NEWS): అమ్మ ఫౌండేషన్ దిగ్విజ‌యంగా 9 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని సంజయ్ నగర్ లో జనగామ అమ్మ ఫౌండేషన్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జనగామ అమ్మ క్యాంటీన్ పోస్టర్ ను కూడా ఆవిష్క‌రించారు.

అమ్మ ఫౌండేష‌న్ కార్యాల‌యాన్ని స్వాతంత్ర సమరయోధులు కొండ జగన్నాథం కుమారుడు , సీనియర్ జర్నలిస్టు కొండా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…

ఫౌండేష‌న్ కార్యాల‌యాన్ని ప్రారంభించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఆర్థిక బలం కూడా ఉండాల‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మ‌లో భాగ‌స్వామ్యం అయ్యే అవ‌కాశం ఇచ్చినందుకు ఫౌండేష‌న్ నిర్వాహ‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మంతెన మని, ఇత‌ర స‌భ్యులు, జ‌న‌గామ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

Also read: ఎస్‌బిఐలో 103 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.