తెలంగాణలో కొత్తగా 1,058 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇన్న రాత్రి 8 గంటల వరకు 38,757 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1058 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 1058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,60,834కి చేరింది. ఇందులో 2,46,733 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,682 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 4 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1419కి చేరింది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 1440 మంది కోలుకొని డిశ్చార్జ్ కావడం విశేషం.