యాదగిరి గుట్టలో సామూహిక గిరి ప్రదక్షిణ
యాదగిరి గుట్ట (CLiC2NEWS): యాదాద్రి లక్ష్మీ నారసింహుడి క్షేత్రంలో స్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా బుధవరం వేకువ జామున దేవస్థానం చేపట్టిన `గిరి ప్రదక్షిణ` ఘనంగా సాగింది. ప్రథమంగా వైకుంఠ ద్వారం వద్ద పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల జయ జయ ధ్వానాలు, మహిళల కోటాలతో కోలాహలంతో నిండింది.
Also Read: సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ