తెలంగాణలో కొత్తగా 873 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 41,646 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 873 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇందులో 2,50,453 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,643 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.
ఇక తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1430కి చేరింది. నిన్న ఒక్కరోజే 1296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 51,34,335 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.