ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురి మృతి

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (CLiC2NEWS): తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని న‌ల్ల‌జ‌ర్ల మండ‌లంలోని అనంత‌ప‌ల్లి శ‌వారు ప్రాంతంలో ఆగి ఉన్న లారీని ఓ కారు బ‌లంగా ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేర‌కు. రాజ‌మ‌హేంద్ర‌వరానికి చెందిన ఎనిమిది మంది హైద‌రాబాద్ లోని ఓ వివాహ కార్యక్ర‌మానికి హాజ‌రైన తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కారు న‌ల్ల‌జ‌ర్ల మండ‌లం అనంత‌ప‌ల్లి ప్రాంతానికి రాగా.. అక్క‌డ రోడ్డుపై ఆగి ఉన్న లారీ కారు అదుపు త‌ప్పి బ‌లంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మాద‌స్థ‌లిలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.