తిరుమ‌ల‌లో న‌కిలి ఐఎఎస్ అధికారి

తిరుమ‌ల (CLiC2NEWS): న‌కిలి ఐఎఎస్ అధికారిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం విజెలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.తిరుమ‌ల‌లో న‌కిలి ఐఎఎస్ అధికారి న‌ర‌సింహారావును అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్ర‌ట‌రీ హోదాలో శ్రీ‌వారి బ్రేక్ ద‌ర్శ‌నానికి ఆయ‌న సిఫార్స లేఖ స‌మ‌ర్పించారు. ఆయ‌న వైఖ‌రిపై అనుమానంతో ఇఓ కార్యాల‌య సిబ్బంది విజిలెన్స్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. దీతో న‌ర‌సింహారావును అదుపులోకి తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదేమాదిరిగా గ‌తంతో విజ‌య‌వాడ‌, గుంటూరులోను ఆయ‌న మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.