AP Corona: కొత్తగా 19,981 కేసులు.. 118 మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో 90,609 మందికి కరోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 19,981 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,62,683 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 18,336 మంది కోలుకున్నారు. ఇక వీరిలో 13,41,355 మంది కోలుకోన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 10,022 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజాగా 118 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా మ‌ర‌ణాలు..

ఇక శనివారం నమోదైన మరణాల్లో పశ్చిమగోదావరి అత్యధికంగా 15 మంది మృతి చెందగా, చిత్తూరులో 14, తూర్పుగోదావరి 11, విశాఖ 11, గుంటూరు 10, అనంతపురం 9, కృష్ణా 9, శ్రీకాకుళం 8, విజయనగరం 8, కర్నూలు 7, నెల్లూరు 7, ప్రకారం 7, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.