రామగుండం పోలీస్ కమిషనరేట్ కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం

 మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొక్కురు గ్రామంలో కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వ‌హించారు. సిపి రెమా రాజేశ్వరి అదేశాల మేరకు చెన్నూర్ ఇన్స్పెక్టర్ వాసుదేవ రావు ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం వారు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ కార్యక్రమంలో సాంఘీక దురాచారాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలు, హత్యలు, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై మరియు వివిధ చట్టాలపై గ్రామీణ ప్రజలకు చైతన్యం క‌ల్పించారు. షీ టీమ్ , డయాల్ 100 , అభయ యాప్, ఇతర రుగ్మతలపట్ల ఆట,పాటల ద్వారా నాటికల ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమం లో చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవ రావు ఎస్సై.. పొక్కురు సర్పంచ్ నరేందర్, పోలీస్ సిబ్బంది, గ్రామప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.