ఆగ‌స్టు 15 నాటికి రైతు రుణ‌మాఫి: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆగ‌స్టు 15 నాటికి రూ. 2 ల‌క్ష‌ల మేర రైతు రుణ‌మాఫి చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నారాయ‌ణ‌పేటలో నిర్వ‌హించిన కాంగ్రెస్ జ‌న‌జాత‌ర స‌భ‌లో సిఎం మాట్లాడుతూ.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాన‌లో 15 ఎంపి సీట్లు కాంగ్రెస్ గెలిస్తే ముదిరాజ్ బిడ్డ‌ను మంత్రిగా చేస్తాన‌ని అయ‌న అన్నారు. రాష్ట్రంలో 10% ఉన్న ముదిరాజ్‌ల‌కు కెసిఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వ‌లేద‌ని.. సుప్రీంకోర్టులో కేసు న‌డుస్తున్నా.. ప‌దేళ్లపాటు ఆయ‌న ప‌ట్టించుకోలేద‌న్నారు. ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌ను బిసి-డి నుండి బిసి-ఎ గ్రూప్‌లోకి మార్చేందుకు సుప్రీంకోర్టులో పోరాడ‌తామ‌ని సిఎం తెల‌పారు. మ‌రోవైపు మాదిగ‌ల వ‌ర్గీక‌ర‌ణ చేయాల్సిందేన‌ని, వాళ్ల‌కు న్యాయం జ‌ర‌గాల్సిందేన‌ని .. భ‌విష్య‌త్తులో మాదిగ‌ల‌కు మ‌రిన్ని ప‌దువులు ఇచ్చి స‌ముచిన స్థానం క‌ల్పిస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.