బాణాసంచా త‌యారీ కేంద్రంలో భారీ అగ్ని ప్ర‌మాదం.. ముగ్గురి స‌జీవ‌ద‌హనం

తిరుప‌తి (CLiC2NEWS): జిల్లాలో బాణా సంచా త‌యారు చేసే చోట అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్ఉరు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ వ‌ర‌ద‌య్య‌పాలెం మండ‌లం కువ్వాకుల్లి గ్రామంలోని బాణ‌సంచా గిడ్డంగిలో బుధ‌వారం చోటుచోసుకుంది. బాణా సంచా పేల‌డంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. చ‌నిపోయిన వారు నాగేంద్ర‌, శంక‌ర‌య్య‌, ఏడుకొండ‌లుగా గుర్తించారు. గిడ్డంగి య‌జ‌మానికి కూడ తీవ్ర‌గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను తిరుప‌తి రుయాకు త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించి, ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలను విచారిస్తున్నారు.

1 Comment
  1. This website truly has all of the information and facts I needed concerning this
    subject and didn’t know who to ask.

Leave A Reply

Your email address will not be published.