వినాయ‌క న‌వ‌రాత్రులు.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో సేవ‌లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రం గ‌ణేష్ ఉత్స‌వాల‌కు ముస్తాబ‌వుతోంది. వినాయ‌క న‌వ‌రాత్రులు సంద‌ర్భంగా మెట్రో శుభ‌వార్త తెలిపింది. అర్ధ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కు మెట్రో సేవ‌లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. న‌గ‌రంలోని ఖైర‌తాబాద్ గ‌ణేష్‌ని ద‌ర్శించుకోవడానికి ఇక్క‌డి వారే కాకుండా పొరుగు రాష్ట్రాల‌నుండి కూడా భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌ణేషుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల‌ను దృష్టి ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో ఖైర‌తాబాద్ మెట్రో స్టేష‌న్లో అద‌న‌పు టికెట్ కౌంట‌ర్ల‌ను ఓపెన్ చేయ‌నున్నారు. భ‌క్తుల‌కు స‌మ‌యం వృథా కాకుండా వీలైనంత త్వ‌ర‌గా టికెట్ పొందేలా ఏర్పాట్లు చేయ‌నున్నారు. స్టేష‌న్ వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.