India Corona: మ‌రోసారి వెయ్యి దాటిన మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గినట్లే త‌గ్గి పెరుగుతున్నాయి. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 42,766 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య‌శాఖ శ‌నివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716 కు పెరిగింది.
  • కొత్త‌గా 45,254 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 2,99,33,538 మంది కోలుకున్నారు.
  • గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1206 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనా మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకుంది.
  • ప్ర‌స్తుతం దేశంలో  4,55,033 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
Leave A Reply

Your email address will not be published.