IPL 19 Season Final: ఆర్‌సిబి ప‌రుగుల లక్ష్యం 156

IPL 19 Season Final:ఐపిఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆర్‌సిబి, గుజ‌రాత్ టైటాన్స్ త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్ జ‌ట్టు 8వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్స్ వ‌రుస‌గా..
గిల్ 10 ప‌రుగులు, సుద‌ర్శ‌న్ 12, సింధు 20, జోష్ 19, వాషింగ్ట‌న్ సుంద‌ర్ 50, అర్ష‌ద్ 15, రాహుల్ , హోల్డ‌ర్ , ర‌షీద్ త‌లో 7 ప‌రుగులు చేశారు.

10 ప‌రుగులు చేసిన గిల్ ముందుగా ఔట‌య్యాడు.
రెండో వికెట్‌కి కేవ‌లం 26 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. సాయి సుద‌ర్శ‌న్ 12 ప‌రుగులు తీసి ఔట‌య్యాడు. 55 ప‌రుగులు వ‌ద్ద సింధు ఔట‌య్యాడు . దీంతో గుజ‌రాత్ జ‌ట్టు 3 వికెట్లు కోల్పోయింది. 12ఓవ‌ర్లో 73 ప‌రుగుల వ‌ద్ద జాస్ బ‌ట్ల‌ర్ వెనుదిరిగాడు. 14 ఓవ‌ర్లు పూర్త‌యిన అనంత‌రం 99 గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు 99 ప‌రుగులు చేసింది. అర్ష‌ద్ ఖాన్ ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. రాహుల్ ఏడు ప‌రుగులు చేసి 16.1 ఓవ‌ర్లో 115 ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యాడు.దీంతో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు 6వ వికెట్ కోల్పోయింది. 18.3ఓవ‌ర్లో ఆ జ‌ట్టు 7వ వికెట్ కోల్పోయింది. ఏడు ప‌రుగులు చేసిన హోల్డ‌ర్ ఔట‌య్యాడు. 151 ప‌రుగుల వ‌ద్ద గుజ‌రాత్ ఏనిమిదో వికెట్ కోల్పోయింది. ఆజ‌ట్టు మొత్తం 8వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది.

 

RCB vs GT: ఐపిఎల్ ఫైన‌ల్ పోరు..

Leave A Reply

Your email address will not be published.