జలమండలిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ఖైరతాబాద్  జ‌ల‌మండ‌లి కార్యాల‌యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీ హాజరై.. జ్యోతి ప్రజ్వలన చేసి, పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అన్నారు.

ఎంతో కాలంగా వివక్ష, అణచివేతకు గురైన వారి అభ్యున్నతికి పూలే తోడ్పాటును అందరించారని, అంటరానితనం నిర్మూలన, వివక్షకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేశారు. అదేవిధంగా మహిళలకు, ఆడపిల్లల చదువుల కోసం జ్యోతిరావు పూలే దంపతులు విశేష కృషి చేసారని కొనియడారు.

ఈ కార్యక్రమంలో సీజీఎంలు దశరథ్ రెడ్డి, శ్రీధర్, వినోద్ భార్గవ, ప్రభు, జీఎంలు, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జలమండలి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి సాయికిరణ్ గౌడ్, ఇతర నాయకులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.