ఇద్ద‌రు పిల్ల‌లుతో స‌హా బావిలోకి దూకిన త‌ల్లి..

నెల్లికుదురు (CLiC2NEWS): మహాబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ‌లం వెంక‌టాపురంలో ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు పిల్ల‌లుతో క‌లిసి బావిలో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లి, కుమార్తె ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వివరాలు సేక‌రిస్తున్నారు. కుటుంబ క‌ల‌హాల‌తో ఆ త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.