80 సీట్ల‌కు త‌క్కువ వ‌స్తే కెసిఆర్ వేసే శిక్ష‌కు సిద్ధం: రేవంత్ రెడ్డి

నిజామాబాద్ (CLiC2NEWS): వంద రోజుల్లో షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ తెరిపిస్తామ‌ని సిఎం కెసిఆర్ చెప్పి ప‌దేళ్లు గ‌డిచింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఫ్యాక్ట‌రీని ఎందుకు తెర‌వలేద‌ని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. నిజామాబాద్‌లో జ‌రిగిన కాంగ్రెస్ విజ‌య‌భేరి యాత్ర‌లో ఆయ‌న మాట్లాడుతూ బిఆర్ ఎస్ పై ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ప‌సుపు బోర్డు తెస్తామ‌ని చెప్పి గెలిచిన ఎంపి జాడ లేకుండా పోయార‌ని ఆరోపించారు. బిఆర్ ఎస్ పాల‌న‌లో ద్ధ‌తు ధ‌ర అడిగిన ఎర్ర‌జొన్న రైతుల‌పై పోలీసు కేసు పెట్టార‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు గెలుస్తుంద‌ని.. 80 సీట్ల‌కు త‌క్కువ వ‌స్తే కెసిఆర్ వేసే శిక్ష‌కు నేను సిద్ధం అని రేవంత్ రెడ్డి స‌వాల్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.