బిఆర్ ఎస్‌లో చేరిన ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): బిఎస్‌పి రాష్ట్ర మాజి అధ్య‌క్షుడు ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బిఆర్ ఎస్‌లో చేరారు. ఇటీవ‌ల బిఆర్ ఎస్ – బిఎస్‌పి పొత్తు పెట్లుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ప్ర‌వీణ్ కుమార్ బిఆర్ ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ఎర్ర‌వ‌ల్లిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కెసిఆర్ ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌వీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో గులాబి పార్టీలోకి మారాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అక్క‌సుతో మాట్లాడుతున్నార‌ని.. ప్యాకేజి తీసుకునే వాడినైతే అధికార పార్టీలో చేరే వాడిన‌న్నారు. గేట్లు తెరిస్తే వ‌చ్చే గొర్రెల మంద‌లో ప్ర‌వీణ్ ఉండ‌ర‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.