శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడు సౌదీ రియాల్స్, దిర్హమ్ నోట్లను అక్రమంగా తరలిస్తుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న విదేశీ కరెన్సీ విలువ భారత కరెన్సీలో రూ.10లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కరెన్సీని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.