లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

ముంబ‌యి (CLiC2NEWS): నిన్న ఒడిదుడుకుల మ‌ధ్య లాభాల్లో ముగిసిన సూచీలు కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో లాభాల బాట‌లో దూసుకువెళ్తున్నాయి. కాగా గ‌త వారం భారీ న‌ష్టాలు మూట‌గ‌ట్టుకున్న స్టాక్ మార్కెట్ ల‌కు ఈ వారం కొంత ఉప‌శ‌మ‌నం ల‌భిస్తోంది. అలాగే ఆసియా-ప‌సిపిక్ సూచీలు కూడా భారీ లాభాల్లో దూసుకువెళ్తున్నాయి. దానికి తోడు యుఎస్ ఫ్యూచ‌ర్స్ సైతం సానుకూలంగా ఉన్నాయి. అలాగే దేశీయంగా కీల‌క కంపెనీల షేర్ల‌న్నీ రాణిస్తున్నాయి. ఈ ప‌రిణామాల మ‌ధ్య ఇవాళ (మంగ‌ళ‌వారం) మ‌ధ్యాహ్నం 1.07 గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్ 1012 పాయింట్లు ముందుకు దూసుకువెళ్లి 52,610 వ‌ద్ద రాణిస్తోంది. నిఫ్టీ 303 పాయింట్లు లాభ‌ప‌డి 15,653 వ‌ద్ద ట్రెండ‌వుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ప‌య‌నిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.