T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్ కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

ముంబ‌యి (CLiC2NEWS): టీ20 ప్రపంచ కప్‌ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. విరాట్ కోహ్లీ సార‌థ్యంలో 15 మందితో కూడిన జ‌ట్టును ఎంపిక చేసింది. యుఎఇ వేదిక అక్టోబ‌రు 17 నుంచి టీ 20 ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం కానుంది.

జ‌ట్టు వివ‌రాలు..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌) సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ టోర్నీకి ఎంపిక చేసింది.

స్టాండ్‌ బై ప్లేయర్లుగా శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌ను తీసుకుంది.

భారత జట్టుకు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మెంటర్‌గా వ్యవహరించనున్నాడు.

1 Comment
  1. Social Media Marketing says

    Wow, amazing blog structure! How long have you been blogging for? you made blogging glance easy. The full look of your website is great, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.