గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష: పావుగంట ముందే గేట్ క్లోజ్‌

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్రంలో ఈ నెల 16న గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిన‌దే. ఈ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో టిఎస్‌పిఎస్‌సి మార్పులు చేసింది. 16 వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌ నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు ప‌రీక్ష స‌మయం ఉంటుంది. ప‌రీక్ష స‌మయానికి 15 నిమిషాలు ముందుగానే.. అంటే ఉద‌యం 10.15గంట‌ల‌కు ప‌రీక్ష కేంద్రం గేట్ మూసివేసి, అభ్య‌ర్థుల‌ను లోప‌లికి అనుమ‌తించ‌మ‌ని వెల్ల‌డించింది.

రాష్ట్రంలో మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల‌కు గాను 3,80,202 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేశారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను వెబ్‌సైట్‌నుండి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప‌రీక్ష కేంద్రాల‌కు అభ్య‌ర్థులు చెప్పుల‌తోనే రావాల‌ని సూచించింది. గోరింటాకు, సిరా, టాటూస్ త‌దిత‌రాల‌తో చేతులు, కాళ్ల‌కు అలంక‌ర‌ణ‌లు ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. త‌ప్ప‌డు ధ్రువీక‌ర‌ణ‌ ప‌త్రాల‌తో హాజ‌రైనా, ఒక‌రి పేరిట మ‌రొక‌రు వ‌చ్చినా.. క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని, క‌మిష‌న్ ప‌రీక్ష‌ల నుండి డీబార్ చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్రిలిమిన‌రీ అభ్యర్థుల నుండి బ‌యోమెట్రిక్ తీసుకున్న త‌ర్వాతే పరీక్ష రాసేందుకు అనుమ‌తిస్తామ‌ని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. ఇది మెయిన్స్‌కి వ‌చ్చిన‌పుడు తీసుకున్న దానితో స‌రిపోలితే ప్ర‌ధాన మెయిన్ ప‌రీక్ష రాసేందుకు అనుమ‌తి ఉంటుంద‌ని స్స‌ష్టం చేసింది.

1 Comment
  1. gate.io fon şifresi nedir says

    I am a student of BAK College. The recent paper competition gave me a lot of headaches, and I checked a lot of information. Finally, after reading your article, it suddenly dawned on me that I can still have such an idea. grateful. But I still have some questions, hope you can help me.

Leave A Reply

Your email address will not be published.