మహారాష్ట్రలో కొత్త‌గా 15,602 కరోనా కేసులు

ముంబ‌యి: మహా­రా­ష్ట్రలో గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 15,602 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే తాజాగా 88 మంది కోవిడ్‌తో మ‌ర‌ణించారు. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ శ‌నివారం సాయంత్రం బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,97,793కు చేరింది. అలాగే మొత్తం మర­ణాల సంఖ్య 52,811కు చేరింది. అలాగే తాజాగా గత 24 గంటల్లో 7,467 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. ప్రస్తుతం మ‌హారాష్ట్రలో 1,18,525 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే ముంబ‌యి నగరంలో ఈ ఏడాదిలో గరిష్ఠంగా 1,709 కొత్త కేసులు నమోదయ్యాయ‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.