తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధఙలో కొత్తగా 1,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,237కి చేరింది. ఇందులో 3,02,768 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8,746 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1723కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం నిన్నటి రోజున 268 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.